PL: సన్రైజర్స్ ఆటగాడికి కరోనా.. ఇక ఐపీఎల్ ఆటకి ఆటంకమా..?

ఐపీఎల్ మ్యాచ్ అంటే భారతదేశ ప్రజలకు చాలా ఇష్టం. ఇక వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరూ ఎక్కువగా ఐపీఎల్ మ్యాచ్ లన్నే చూస్తూ ఉంటారు.ఇక ఇందులో మొత్తం 8 జట్లు ఉంటాయి. ప్రేక్షకులు తమ తమ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ల మ్యాచ్ ను చూసేందుకు చాలా ఆసక్తికరంగా ఉంటారు.

ఇక నిన్నటి రోజున హైదరాబాద్ జట్టు క్రికెటర్ నటరాజన్ కు కరోనా పాజిటివ్ తేలిందట. దీంతో ఈ రోజు సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడవలసిన మ్యాచ్ సందిగ్ధంలో పడిపోయింది. ఇక అతనితో సన్నిహితంగా ఉన్న కొంత మంది ఆటగాళ్లను,ఇక మిగతా ఆటగాళ్ల పిసిఆర్ రిపోర్ట్ రావాల్సి ఉంది. వారి టెస్ట్ ఫలితాలను వచ్చిన అనంతరం మ్యాచ్ నిర్వహణ లేదా వాయిదా వేసి ప్రకటన అవకాశం ఉంది.

ఇక గతంలో కూడా ఇలాగే పాజిటివ్ రావడం వల్ల ఆట ఆపేశారు. ఈసారి కూడా అదే జరిగేటట్లు అవకాశం కనిపిస్తున్నట్టుగా సమాచారం. ఏది ఏమైనా పి సి ఆర్ టెస్ట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.https://twitter.com/IPL/status/1440613081462177798?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1440613081462177798%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Ftv9telugu-epaper-tvninete%2Fipl2021sanraijarsaatagaadikikaronapaajitivdhillitomyaachraddayyeavakaashan-newsid-n317574600%3Fs%3Dauu%3D0x510504f18d072da1ss%3Dwsp