క్రికెట్ పై షాకింగ్ డెసిషన్ తీసుకున్న శ్రీలంక క్రికెటర్ మలింగ..?

క్రికెట్ అంటే ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఇక శ్రీలంక క్రికెట్ జట్టు లో దిగ్గజ క్రికెటర్ అయినా మలింగ తన బౌలింగ్ తో బ్యాట్ మ్యాన్డ్లని కట్టడి చేస్తాడని చెప్పవచ్చు.. అయితే అంతర్జాతీయ క్రికెట్ కు ముగింపు చెప్పేసాడు మలింగ. ఇక తను క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.

మలింగ క్రికెట్ ఆడకున్నా సరే.. క్రికెట్ పై ప్రేమ అలాగే ఉంటుందని తెలియజేశాడు. తను 17 సంవత్సరాలుగా క్రికెట్ అనుభవం కలదు.. ఆ అనుభవంతో కుర్ర క్రికెటర్లకు తనకు తెలిసిన విధంగా పాఠాలు చెబుతాను అని స్పష్టం చేశాడు. మలింగ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏకంగా 30 టెస్టులు, 226 వన్డేలు, 83 T-20 మ్యాచ్లు.. మరియు 122 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు.

ఇక అంతే కాకుండా ఇప్పటి వరకు దాదాపుగా 500కు పైగా వికెట్లను పడగొట్టాడు మలింగ. ఇక ఈ రోజున తను వీటన్నిటికీ రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లుగా తెలియజేశాడు.