దేశంలో మ‌రింత పెరిగిన క‌రోనా కేసులు..281 మంది మృతి!

ప్ర‌పంచ‌దేశాల‌ను పెను భూతంలా ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అనుకుంటున్న త‌రుణంలో ఈ మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ఊపందుకుని ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది

గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 35,662 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,17,390 కు చేరుకుంది. అలాగే నిన్న 281 మంది క‌రోనా కార‌ణంగా మృత్యువాత ప‌డ‌గా.. దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,44,529 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 33,798 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,26,32,222 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్ర‌స్తుతం 3,40,639 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.