ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్..!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఆడియో ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు రానే వచ్చాడు.ఈ ఫంక్షన్ సాయి ధరంతేజ్ హాజరు కాలేక పోవడంతో పవన్ కళ్యాణ్ హాజరు కావడం జరిగింది.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ ఇంకా కళ్ళు తెరవలేదు, ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం కుదుటపడుతుందని, ఇంకా తను బెడ్ పైన ఉన్నాడు అన్నట్లుగా తెలియచేశాడు.

సాయి ధరంతేజ్ తన సినిమా రిలీజ్ వేడుకలు లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురిచేస్తోందని తెలియజేశాడు.ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇదే క్రమంలో సినిమా రిలీజ్ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

ఇక సాయి ధరంతేజ్ పై ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ ని ప్రమోషన్లలో పాల్గొనడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.తెలుగు సినీ పరిశ్రమ పై వైసీపీ నేతలు కన్నెత్తి చూసిన కాలిపోతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పెట్టుబడులతో సినిమాలు తీసే విషయంలో ప్రభుత్వ పెత్తనం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు. సినిమా పెద్దలు ఎందుకు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆలోచిస్తున్నారు అన్నట్లుగా సెటైర్లు వేశాడు.

ఇది వైసిపి రిపబ్లిక్ కాదని.. ఇండియన్ రిపబ్లిక్ అంటూ వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అన్ని పనులు చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని.. తెలియజేశాడు.