అలాంటి పాత్రలో కూడా నటిస్తానంటున్న యాంకర్ అనసూయ..?

బుల్లితెరపై యాంకర్ గా జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి యాంకర్ అనసూయ.ఈమె ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను బాగా అలరించేది.రంగస్థలం సినిమాలో రంగమ్మ పాత్ర వేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది అనసూయ.

సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం పుష్ప సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నది. ఇక ఇదే తంతులో సినిమా పాత్రలపై తాను స్పందిస్తూ ఒకే తరహా పాత్రలు తాను చేయాలని భావించడం లేదని పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రనైనా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అంతే కాకుండా హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలో నటించడానికి తనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది.

అలా నటించిన తర్వాత సినిమా చూసిన ప్రేక్షకులు తన పాత్ర గురించి మాట్లాడుకోవాలి అని అనసూయ కామెంట్లు చేయడం గమనార్హం. రాబోయే రోజుల్లో అనసూయ ఇలాంటి పాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రస్తుతం రంగమార్తాండ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నది అనసూయ అందుకోసం భారీ పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.