ప్రస్తుతం మనం ఉన్న జనరేషన్ లో వాయు కాలుష్యం ఏవిధంగా ఉందో మనందరికి తెలిసిందే. అయితే ఈ వాయు కాలుష్యం వల్ల భారతీయుల ఆయుర్ధామం తొమ్మిదేళ్లు తగ్గవచ్చునని అమెరికాకు చెందిన ఒక అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని 48 కోట్ల జనాభా ప్రజలు ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన వాయు కాలుష్యానికి ఎదుర్కొంటున్నారు. అయితే ఇది రానున్న రోజుల్లో ఆమె మరింత అధికమయ్యే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది. ప్రపంచ కాలుష్య ర్యాంకింగ్ లలో భారతీయ నగరాలు తరచూ ముందువరుసలో నిలుస్తున్నాయి. అది కాకుండా ఈ వాయుకాలుష్యం ప్రతి ఏడాది పది లక్షల కంటే ఎక్కువ మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది.
అయితే ఇతర ప్రదేశాలతో పోల్చుకుంట ఉత్తర భారత దేశంలోని పలు నగరాల్లో ఉన్న ప్రజలు ప్రపంచంలోని అన్ని కాలుష్య నగరాల కంటే పది రెట్లు ఎక్కువగా ఉన్న వాయు కాలుష్యానికి గురవుతున్నారని ది ఎనర్జీ పాలసీ ఇన్స్స్టీట్యూట్ ఎట్ ది యూనివర్సిటీ ఆఫ్ చికాగో తన నివేదికలో పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకానికి అనుగుణంగా వాయు కాలుష్యాన్ని తగ్గినట్లయితే ఢిల్లీ లో నివసిస్తున్న వారి జీవితాల్లో 10 సంవత్సరాల వరకు ఆయుర్ధాయాన్ని పెంచుకోవచ్చని ఈపీఐసీ వెలువరించిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ రిపోర్ట్ కొత్త డేటా చెబుతోంది.