ప్రముఖ నటి, ఢీ షో జడ్జ్ పూర్ణ టెర్రస్ మీద నుంచి కింద పడిపోయారట. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదులేండి. అసలు ఇంతకీ ఏమైందంటే.. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నిర్మాతగా మారి ఓ వెబ్ సిరీస్ను తెరకెక్కించాడు. అదే `టెర్రస్`. ఈ సిరీస్ ఆయన సొంత యూట్యూబ్ ఛానెల్లోనే విడుదల కాబోతోంది.
అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం తన సన్నిహితుల సాయం తీసుకుంటున్నాడు శేఖర్ మాస్టర్. ఈ క్రమంలోనే అనసూయ, ప్రియమణి, ఆది వంటి వారు తమ తమ జీవితంలోని టెర్రస్ కథలను బయటపెడుతున్నారు. ఇందులో భాగంగా పూర్ణ తన టెర్రస్ కథను ఈ వీడియోలో చెప్పుకొచ్చింది.
`శేఖర్ మాస్టర్ నిర్మాతగా మారి శేఖర్ స్టూడియోలో టెర్రస్ అనే వెబ్ సిరీస్ను తీస్తున్నారు. దాన్ని చూసేందుకు నేను చాలా ఎగ్జైట్గా ఉన్నా. నాకు టెర్రస్ లవ్ స్టోరీల్లాంటివి అయితే ఏమీ లేవు. ఎందుకంటే నా చుట్టు పక్కల ఉన్న వాళ్లంతా నా బ్రదర్స్ లాంటి వాళ్లే. అయితే టెర్రస్ అంటే మాత్రం ఓ సంఘటన గుర్తుకు వస్తుంది. చిన్నప్పుడు టెర్రస్ మీద నుంచి కిందపడ్డాను. అప్పుడు తలకు పెద్ద గాయమైంది. రెండు మూడు నెలలు హాస్పిటల్లోనే ఉన్నాను.` అంటూ వీడియోలో పూర్ణ చెప్పుకొచ్చింది.