ఏసీపీ అధికారిణి పై దాడి.. అత్యంత దారుణంగా..!

రోజురోజుకు దారుణాలు ఎలా చోటుచేసుకుంటున్నాయి అంటే, విన్నంతనే ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.. ఇకపోతే ఒక దుర్ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ ఆదేశాల మేరకు ఫుట్ పాత్ మీద రోడ్లను ఆక్రమించుకొని , అక్రమంగా ఏర్పాటుచేసిన దుకాణాలను ,వ్యాపారాలను ఖాళీ చేసేందుకు వెళ్లిన పోలీస్ అధికారిణి పై ఊహించని రీతిలో దాడి చేయడం జరిగింది.. ఇకపోతే ఫుట్ పాత్ మీద అక్రమంగా దుకాణాన్ని ఏర్పాటు చేసిన వారిలో, ఒక వ్యాపారి చేసిన దారుణం ప్రస్తుతం షాకింగ్ గా మారింది.

ఇక అప్పటికే తోపుడు బళ్లను అధికారులు ఖాళీ చేస్తున్న సమయంలో అధికారులు కూడా అక్కడకు చేరుకున్నారు. ఇంత కాలంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న మమ్మల్ని.. ఉన్నట్టుండి ఖాళీ చేయమంటారా..? అంటూ ఒక వ్యక్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అమర్జీత్ యాదవ్ అనే ఒక కూరగాయల వ్యాపారి.. మహిళా ఏసీపీ కల్పిత పింపుల్ పై కత్తితో దాడి చేయడంతో, ఆమె చేతివేళ్ళు మూడు తెగిపడ్డాయి ..అంతే కాదు తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

 

ఆమె సెక్యూరిటీ గార్డుకి కూడా గాయాలు కావడంతో ఇద్దరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ కూరగాయల వ్యాపారి పైన దాడి కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. హత్యాయత్నం కింద ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించిన తీరుపై అతనిపై కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ వినయ్ పేర్కొన్నారు..