ఆ హీరోయిన్ తో నటించడం ఇష్టమంటున్న ఉప్పెన డైరెక్టర్..!

మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా , కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఉప్పెన. ఈ సినిమాతో ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడిగా గుర్తింపు పొందిన బుచ్చిబాబు సనా దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సనా ఈసారి ఏకంగా పెద్ద హీరోలను టార్గెట్ చేసుకున్నాడు. అందులో భాగంగానే స్పోర్ట్స్ డ్రామాగా ఒక సినిమాకు ఎన్టీఆర్ ను హీరోగా తీసుకోవాలని అనుకున్నాడు.. కానీ ఎన్టీఆర్ తన ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు..

అసలు విషయానికొస్తే బుచ్చిబాబు సనాకు..ఐశ్వర్య రాజేష్ నటన అంటే చాలా ఇష్టమట.. ఇక ఈమెతో కలసి పనిచేయాలని ఆయనకు ఉందట.. తన మనసులోని మాటను ఇటీవల ఐశ్వర్య రాజేష్ తోనే తెలిపాడు బుచ్చిబాబు.. ఇక ఈ విషయాలన్నీ బుచ్చిబాబు గురించి ఐశ్వర్య రాజేష్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఐశ్వర్య తెలుగు అమ్మాయి అయినప్పటికీ , తమిళంలో హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటిస్తూ బిజీ జీవితాన్ని గడుపుతుంది. తెలుగులో సాయి ధరమ్ తేజ్ తో రిపబ్లిక్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ ఒకటో తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.. ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. తెలుగు నుంచి ఇప్పుడిప్పుడే మంచి ఆఫర్లు వస్తున్నాయి.. కానీ డిఫరెంట్ పాత్రలు చేయాలని ఉంది అంటూ ఆమె తెలియజేసింది.

బుచ్చిబాబు సనాను సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో కలిసాను.. మీ నటన నాకు చాలా బాగా నచ్చుతుంది.. మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నాను అని బుచ్చిబాబు తెలిపినట్లు ఆమె తెలిపింది.