విమర్శకుల పాలైన నయనతార..

ఇటీవల కాలంలో చాలా మంది స్టార్ హీరోయిన్ లు సైతం విమర్శకుల పాలవుతున్నారు.మొన్నామధ్య సమంత బాగా ట్రోలింగ్ కి గురి అయిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రత్యేకమైన శైలి ని కలిగి వుంటుంది నయనతార. ఎన్నో సినిమాలలో నటించి అటు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటు తమిళ్ ,కన్నడ, మలయాళం ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.ఇకపోతే ఈమె సినిమాలలో నటించాలంటే ప్రతిసారి కండిషన్లు పెడుతుందట. అదేమిటంటే .. సినిమాలో నటించడం వరకే తన పని అంట. ఆ తరువాత ప్రమోషన్ల సంగతి తనకి అవసరం లేదు అని. సినిమాకి సైన్ చేసే ముందు ఈ విషయాన్ని ఆమె స్పష్టం చేస్తుంది. ప్రమోషన్ గురించి ఏమైనా అడిగితే సినిమాని వదులుకునేకి కూడా తన సిద్ధ పడుతుందట.

అయినా నయనతార సినిమాలకు అగ్రిమెంట్ చేసుకున్నా సరే , సినిమాను ప్రమోట్ చేయడం నటి బాధ్యత . ఇలా చేస్తే ఎలా అంటూ కొంతమంది రూమర్స్ ను క్రియేట్ చేస్తూనే ఉంటారు. నయనతారకు ఎంత డిమాండ్ ఉంటే మాత్రం ఇలా చేయటం కరెక్ట్ కాదని అంటుంటారు. కానీ ఈ అందాల భామ వారు అనిన మాటలను ఎప్పుడూ పట్టించుకునేది కాదు.

ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పటానికి ముందే శ్రీరామరాజ్యం సినిమాకు మాత్రమే ఆడియో విడుదల చేయడానికి హాజరయ్యింది. అంతేకాకుండా తెలుగు సినిమాలకు చివరి టైం లో లాస్ట్ లో శ్రీరామరాజ్యం సినిమా తీసింది.

ఈమె మంచి స్టార్ ఇమేజ్ ను సంపాదించాక ఏ చిత్రాన్ని చేసింది లేదు. తమిళంలో కూడా ఇలాంటి,ఈ ఒరవడినీ కొనసాగించింది. అయితే నయనతార సినిమా తాజా గా రాబోతున్న నేత్రికన్ సినిమాను ప్రమోట్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన విషయాన్ని రేడియో ఇంటర్వ్యూలో చెప్పింది.

సినిమాని నిర్మిస్తున్నది ఎవరో కాదు తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ ఇందులో గమనించాల్సిన విషయం ఇదే.. అంటే తన బాయ్ ఫ్రెండ్ సినిమాలు మాత్రమే ప్రమోట్ చేసి మిగతా సినిమాలకు దూరంగా ఉండడం ఏంటి అంటున్నారు. ఈ ప్రశ్నలన్నీ టాలీవుడ్ నిర్మాతలు నయనతార ని అడుగుతున్నారు. దీనికి నాయనతార ఏం సమాధానం చెప్పిందంటే, ఈ సినిమాకు ప్రమోట్ చేశానని అగ్రిమెంట్లో సంతకం చేశానని, అక్కడ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాను కాబట్టే ప్రమోషన్ చేస్తున్నానని అంటూ నయనతార మాట్లాడుతోంది.