ఇప్పుడు కరోనా సమయంలో ఏ పని చేయాలన్నా కూడా చాలా కష్టమవుతోంది. ఇక సినిమా షూటింగులు అయితే మాత్రం చెప్పాల్సిన పనిలేదు. కాగా ఇప్పుడు కరోనా ఇంతలా ఉన్నా కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీం మెంబర్లతో కలిసి ఇన్ టైమ్లో రికార్డు సృష్టించారు. కేవలం 4 కామెరాలతో గోవా అలాగే మంగళూరు దాంతో పాటే ఉడుపిలో కూడా మూవీ షెడ్యూల్ ను చాలా తక్కువ టైమ్ లోనే . ఎస్. రాజు టీం, నిర్మాణంతర కార్యక్రమాలు, డబ్బింగ్ కూడా పూర్తి చేసుకోవడం ఇప్పుడు సంచలనం రేపుతోంది.
కాగా త్వరలోనే ఈ మూవీని విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. కాగా డైరెక్టర్ ఎంఎస్ రాజు మాట్లాడుతూ ఈ మూవీ గురించి మాట్లాడుతూ తాము ముందుగానే అనుకున్న సమయానికి మూవీ కంప్లీట్ అయిందని తెలిపారు. దీన్ని కూడా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీదే నిర్మించామని తెలిపారు. కాగా ఇందులో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తూనే ఆయన నిర్మాతగా మారి నిర్మించారు. కాగా దీన్ని 7 డేస్ 6 నైట్స్ కథ” అని పేరు పెట్టారు. ఇక సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ తమ మూవీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోకూడా రికార్డు టైమ్లో షూటింగ్ పూర్తి చేసుకుందన్నారు.