పవన్ కళ్యాణ్ కోసం 600 కి.మీ ప్రయాణం చేసిన అభిమాని..!

బాలీవుడ్ స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఈయన ఎంతోమంది అభిమానులను కూడగట్టుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే ఎంత సందడిగా ఉంటుందో మనందరికీ తెలుసు. అంతేకాకుండా కరోనా బారిన పడిన పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. అయితే తాజాగా ఒక అభిమాని పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని సైకిల్ యాత్ర ద్వారా తెలియజేశాడు.

పవన్ కళ్యాణ్ త్వరగా కొలుకుంటే, కర్నూల్ నుంచి 600 కిలోమీటర్లు ప్రముఖ ఆలయాలను సైకిల్ మీద యాత్ర చేస్తానని మొక్కుకున్నాడు. అతనికి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం ఉండేది . అందుచేత ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. మెగా ఫ్యామిలీ నుండి కోరుకుంటే కొండగట్టు ఆంజనేయ స్వామి, తిరుమల వెంకటేశ్వర స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ కు సైకిల్ మీదుగా వస్తానని చెప్పి ఈశ్వర్ మొక్కుకున్నాడట.

అయితే పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకోవడం తో ఈశ్వర్ తన మొక్కును తీర్చుకోవడానికి సైకిల్ యాత్ర మొదలు పెట్టారు. తిరుపతి నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకోగా అక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. ఇక అంతే కాకుండా 2024 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడాలని తన కోరిక ఉందని కోటి దేవతలను ప్రార్థించానని, ఈశ్వర్ తెలియజేశారు.

ఇతని ప్రార్థన మేరకు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు.