నిధి అగర్వాల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..?

టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను తెచ్చుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్. ఇక ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. ఈమె ఈరోజు తన 28వ పుట్టినరోజు ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా.. ఈమె గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

నిధి అగర్వాల్ తన మొదటి సినిమా”మున్నా మైకేల్” అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఈమె ఆగస్టు – 17 – 1993లో కర్ణాటక రాష్ట్రంలో బెంగళూర్ లో జన్మించింది. ఇక ఈమె తల్లిదండ్రులు హిందూ అగర్వాల్ అమన్, రాజేష్ అగర్వాల్. ఈమె బిజినెస్ మేనేజ్మెంట్ లో డిగ్రీ పూర్తిచేసింది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే నాగచైతన్యతో కలిసి సవ్య సాచి అనే సినిమాతో మొట్టమొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ రోజు 28వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోన్న ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్ (Twitter/Photo)

తన మొదటి సినిమాతోనే తన అందాలతో ప్రేక్షకుల్ని మత్తెక్కించిన ఈ భామ. ఈ మధ్య కాలంలో రామ్ పోతినేని తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి, సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ తో కూడా హరిహర వీరమల్లు అనే సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈమె తమిళంలో ఈశ్వరన్ భూమి అనే సినిమాతో అడుగు పెట్టింది.Fans built the temple for this famous South actress | NewsTrack English 1

ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం వల్ల ఆ రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించడంతో ఆమెకు అక్కడ తన అభిమానులు గుడి కట్టడం కూడా జరిగింది. ఇక అంతలా తను పాపులారిటీ సంపాదించుకుంది నిధి అగర్వాల్. ఏది ఏమైనా అతి తక్కువ సమయంలోనే ఇంత గొప్ప హీరోయిన్ గా గుర్తింపు పొంది, గుడి కట్టించుకోవడం అంటే ఆషామాషీ అయిన విషయం కాదు.