లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `అందాల రాక్షసి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ భాషలోనూ వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ భామ.. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్గా ఉంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చట్లు పెట్టిన లావణ్య.. తనకు సంబంధించిన ఓ షాకింగ్ విషయాన్ని రివిల్ చేసింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా లావణ్య మాట్లాడుతూ.. `నాకు ట్రిపోఫోబియా ఉంది. కొన్ని ఆకారాల్ని, వస్తువుల్ని చూడగానే తెలియకుండానే నాలో భయం ప్రవేశిస్తుంది.
ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే లైఫ్సైకిల్ సక్రమంగా సాగుతుంది. ` అంటూ చెప్పుకొచ్చింది. అయితే లావణ్య తనకున్న సమస్యను చెప్పడంతో.. ఆమె అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.