కన్నీళ్లు కారుస్తుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. కారణం తెలిస్తే షాక్..?

టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీ గా పేరుపొందిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నది. కానీ ఈమెకు ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా హిట్ ఖాతాలో కి చేరుకోలేదు. కానీ వరుస ఆఫర్లతో బాలీవుడ్లో, టాలీవుడ్ లో కూడా బిజీగా ఉన్నది. రకుల్ ప్రీతిసింగ్ తాజాగా కన్నీరు పెట్టుకున్నదట. అందుకు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అక్షయ్ కుమార్ తో నటించిన బెల్ బాటమ్ సినిమా తన కుటుంబ సభ్యులతో,స్నేహితులతో కలిసి చూసిందట. అలా చూసిన ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. బెల్-బాటమ్ సినిమాను చూసీ తను చాలా సంతోషంగా ఉన్నదట. అంతేకాకుండా స్క్రీన్పై ఆ టైటిల్స్ పడినప్పుడు ఆమె చాలా ఎమోషనల్ కి గురైందట.అవి కేవలం ఆనందభాష్పాలు అని తెలియజేసింది. అసలేం జరిగిందంటే అక్షయ్ కుమార్ నటించిన బెల్-బాటమ్ సినిమాను తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి చూసింది

కరోనా సమయంలో కూడా..తాను నటించిన సినిమా ని విడుదల చేయడంతో సినీ బృందానికి అభినందనలు తెలిపింది.ఇదంతా ఇలా ఉండగా ప్రస్తుతం ఈమే డ్రగ్స్ కేసులో ఈడి నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఈమె సినిమా గురించి మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ.. ఈ డ్రగ్స్ కేసు పై స్పందించలేదు అనే విధంగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.