హీరో నిఖిల్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్.!

యంగ్ హీరో నిఖిల్ వైవిధ్యభరితమైన కథలతో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం కూడా ఆయన ఆసక్తికరమైన కథలతో సినిమాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతను మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ప్రకటించి అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నారు.

‘హిట్’, ‘ఎవరు’ వంటి థ్రిల్లర్ డ్రామాలకు ఎడిటర్ గా పనిచేసిన గ్యారీ బి.హెచ్ నిఖిల్ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. నిఖిల్ కొత్త థ్రిల్లర్ మూవీని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఒక స్పై థ్రిల్లర్ గా రూపొందించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మూవీని రెడ్ సినిమాస్ బ్యానర్ పై కె. రాజా శేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించే నటీనటులు ఎవరు? సంగీత దర్శకులు ఎవరు? వంటి విషయాలు త్వరలోనే ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇకపోతే నిఖిల్ హీరోగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వస్తున్న రొమాంటిక్ డ్రామా 18 పేజీస్ త్వరలోనే విడుదల కానుందని.