ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. భారత్లోనూ కరోనా కేసులు, మరణాలు గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి.
అయితే నిన్న మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో భారత్లో 42,982 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,12,114 కు చేరుకుంది. అలాగే నిన్న 533 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,26,290 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 41,726 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 3,09,74,748 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 4,11,076 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నిన్నొక్కరోజే దేశవ్యాప్తంగా 16,64,030 కరోనా టెస్టులు చేశారు.