ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. భారత్లోనూ కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి.
నిన్న కూడా భారత్లో పాజిటివ్ కేసులు దిగి వచ్చాయి. గత 24 గంటల్లో భారత్లో 30,549 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,17,26,507 కు చేరుకుంది. అలాగే నిన్న 422 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,25,195 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 38,887 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 3,08,96,354 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 4,04,958 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నిన్నొక్కరోజే దేశవ్యాప్తంగా 16,49,295 కరోనా టెస్టులు చేశారు.