బాహుబలి , మగధీర కాంబినేషన్ లో మరొక భారీ మూవీ రానుందా..?

రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి తో కలిసి నటించిన చిత్రం మగధీర. ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో మొదటి సారిగా అత్యధిక షేర్ ను వసూలు చేసింది. ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీ అంటే ఏమిటో చూపించాడు రాజమౌళి. ఇక తర్వాత ప్రభాస్ తో కలిసి బాహుబలి మూవీ ని నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో రాజమౌళి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకి రాజమౌళి , ప్రభాస్ దాదాపుగా 5 సంవత్సరాల పాటు కష్టపడి తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతోనే ప్రభాస్ పాన్ స్టార్ గా ఎదిగిపోయాడు. ఇక రాజమౌళి సినిమాలంటే ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా మగధీర రామ్ చరణ్, బాహుబలి ప్రభాస్ కలిసి పాన్ ఇండియా మూవీ నిర్మించబోతున్నారు అని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం నిజమో ..?కాదో..? కానీ ఈ రూమర్స్ ఫ్యాన్స్ ను బాగా ఆనంద పరుస్తున్నాయి అని చెప్పాలి. ఇక అంతే కాకుండా వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తే చూడాలని అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

వీరిద్దరి కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమాపై సైలెంట్ గా వర్క్ జరుగుతుందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఇద్దరు స్టార్ లను ఒకే చిత్రంలో నటింపజేసేందుకు తెరవెనుక చాలామంది కష్టపడుతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇది నిజమో..? కాదో..? ఈ ప్రాజెక్టు ఎంత వరకు సక్సెస్ అవుతుందో..? వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా మల్టీస్టారర్ మూవీస్ తీయడానికి రాజమౌళికి ఆ క్రెడిట్ దక్కుతుంది.