ఆత్మగా మారిన మైఖేల్ జాక్సన్..! తనతోనే ఉంటున్నాడన్న మహిళ ..!

పాప్ సింగర్ గా గుర్తింపు పొందిన అమెరికన్ గాయకుడు. తన పాటలతో ప్రపంచాన్ని మొత్తం ఉర్రూతలూగించిన ఏకైక వ్యక్తి అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అప్పట్లోనే కింగ్ ఆఫ్ పాప్ అని కూడా పిలిచేవారు. 40 సంవత్సరాల కెరియర్లో మ్యూజిక్, ఫ్యాషన్, డాన్స్ తో పాటు దాతృత్వానికి కూడా ఆయన చేసిన కృషి అమోఘం. మైకల్ జాక్సన్ స్టేజి మీద అలాగే వీడియో ప్రదర్శనతో పాటు మూన్ వాక్ వంటి సంక్లిష్టమైన కదలికలను కూడా అవలీలగా చేసి చూపించాడు. ప్రపంచాన్ని అంతట తన పాటలతో ,ఫ్యాషన్ తో తనవైపు తిప్పుకున్న మైఖేల్ జాక్సన్ 2009 జూన్ 25వ తేదీన మరణించిన విషయం తెలిసిందే.

ఈయన తీవ్రమైన మత్తుకు బానిస అయ్యి, గుండెపోటు కూడా రావడంతో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో మరణించడం జరిగింది. అయితే దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇటీవల మైఖేల్ జాక్సన్ గురించి ఒక మహిళ సంచలన వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది వింటే మీరు కూడా ఆశ్చర్యపోయారు.. పూర్తి వివరాల్లోకి వెళితే, ఒక మహిళ మైఖేల్ జాక్సన్ ఆత్మ తనను వివాహం చేసుకుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

యూకే కి చెందిన కాథ్లీన్ రాబర్ట్స్ అనే ఒక మహిళ మైఖేల్ జాక్సన్ మరణం తర్వాత ఆయన ఆత్మ తనతో ఉందని తెలిపింది. మైఖేల్ జాక్సన్ తిరిగి రావడమే కాకుండా తనతో గడుపుతోంది అని, ఇక శృంగారం తప్ప అన్ని పనులు చేస్తోంది అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడంతో , ఇది విన్న ప్రతి ఒక్కరు మైఖేల్ జాక్సన్ ఆత్మ ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి రావడం ఏంటి ..? ఈమెను పెళ్లి చేసుకోవడం ఏంటి..? అంటూ నోరెళ్లబెడుతున్నారు.