న‌డి స‌ముద్రంలో భ‌ర్త‌తో శ్రియ రొమాన్స్.. !

శ్రియ శ‌ర‌న్ అంటే టాలీవుడ్ ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరని చెప్పాలి. ఎందుకంటే ఈ హీరోయిన్ ఒక‌ప్పుడు తెలుగు లోనే కాకుండా ఏకంగా సౌత్ భాష‌ల‌న్నింటిలోనూ మెరిసి తన అందాలతో న‌ట‌న‌తో ఓ ఊపు ఊపేసిన స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ‌. ఇక ఈమె స్టార్ హీరోలందరితో జ‌త‌క‌ట్టి ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్‌, సూప‌ర్ హిట్స్ ను త‌న ఖాతాలో వేసుకుంది ఈ భామ‌. అందం, అందుకు మించిన అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ అమ్మ‌డు 2018లో ఆండ్రీ కోస్చీవ్‌‌ని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.

దాంతో ఆమె సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ సోషల్ మీడియా ద్వార మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అభిమానులతో అందుబాటులో ఉంటుంది. ఆమె నెట్టింట సెగ‌లు రేపే రొమాంటిక్ ఫొటోలతో పాటు వీడియోల‌ను షేర్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఇక తాజాగా త‌న భ‌ర్త‌తో బోటులో రొమాన్స్ కోసం వేదికగా మ‌లుచు కుంది ఈ జోడీ. బోటులో షికారు చేస్తూ సముద్రం మధ్యలో ఈ హాట్ జోడీ రొమాన్స్ తో రెచ్చిపోయార‌ని చెప్పాలి. శ్రీయ అయితే బికినీ వేసుకుని తన భర్త కౌగిలిలో కిస్సుల‌తో చాలా ఎంజాయ్ చేసింది.