కేంద్ర మంత్రివ‌ర్గంలో భారీ మార్పులు.. విద్యావంతుల‌కు అవ‌కాశం!

గ‌త కొద్ది రోజులుగా కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేయబోతున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే తొమ్మిది మంది మంత్రులతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రాజీనామా చేయించారు కూడా. కాగా మరో ముగ్గురు కూడా అదే దిశలో ఉన్నట్లు రీసెంట్ గా తెలిసింది. కేంద్ర మంత్రి వ‌ర్గంలో ఉన్న సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్ లాంటి కీల‌క నేత‌ల‌తో పాటు సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, అశ్విన్ చౌబే లాంటి ఉత్త‌ర భారత‌దేశ నేత‌లు ఈ రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.

అయితే మోడీ తీసుకుంటున్న కొత్త మంత్రివర్గంలో కొత్త వారికి అవ‌కాశం ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో 13 మంది లాయ‌ర్లు, 6గురు డాక్ట‌ర్లు, మిగ‌తా ఐదుగురు ఇంజినీర్లతో పాటే ఏడుగురు సివిల్ ఆఫీస‌ర్లు ఉంటార‌ని తెలుస్తోంది. పీహెచ్‌డీ, ఎంబీఏ లాంటి పెద్ద చ‌దువులు చ‌దివిన వారికి మోదీ ప్రాధాన్యమిచ్చినట్లు స‌మాచారం. కాగా ఇందులో ముగ్గురు ఎస్టీలతో పాటు ఇద్దరు ఎస్సీలకు కేబినెట్ హోదా ప‌దవులు క‌ట్ట‌బెట్ట‌బోతున్నారు మోడీ. అయితే ప్ర‌స్తుతం సహాయ మంత్రులుగా ఉన్న కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్‌లకు మంత్రులుగా పదోన్నతి ఉంటుంద‌ని