భార‌త్‌లో మ‌ళ్లీ ఊపందుకున్న క‌రోనా..భారీగా రోజువారీ కేసులు!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.

అయితే రెండు రోజుల నుంచి మాత్రం దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ ఊపందుకున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 43,509 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,15,28,114 కు చేరుకుంది. అలాగే నిన్న 640 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,22,662 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 38,465 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,07,01,612 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 4,03,840 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నిన్నొక్క‌రోజే దేశంలో 17,28,795 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు.