ఓటీటీలో అజయ్‌దేవ్‌గణ్‌ సినిమా…?

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌దేవ్‌గణ్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌గా కీలక పాత్ర పోసిస్తున్న ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్దంగా ఉనట్లు సమాచారం. అయితే ఈ సినిమాను గతంలోనే ఓటీటీలో విడుదల చేస్తామని చిత్రా యూనిట్ తెలిపిన కానీ విడుదల తేదీని మాత్రం తెలియచేయలేదు. అయితే తాజాగా ఈ సినిమాను ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు ప్రత్యేక వీడియో ద్వారా ప్రేక్షకులకు తెలిపారు అజయ్‌దేవ్‌గణ్‌. ఈ సందర్బంగా అజయ్‌ సోషల్ మీడియా వేదికగా ”1971లో జరిగిన గొప్ప యుద్ధం ‘భుజ్‌’గా ఆగస్టు 13న మీ ముందుకొస్తుంది’అని అభిమానులకు తెలిపారు.

ఇక ఈ సినిమాలో సంజయ్‌దత్, సోనాక్షి సిన్హా, శరద్‌ ఖేల్‌కర్, యమ్మీ విర్క్‌ తదితరులు కీలక పాత్ర పోసిస్తున్నారు. ఈ సినిమాకు అభిషేక్‌ దుదయా దర్శకత్వం వహించిన సంగతి అందరికీ విదితమే. ఇది ఇలా ఉండగా సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యినప్పటికి ఈ సినిమా ను ఓటీటీలో విడుదలకే సిద్దంగా ఉనట్లు చిత్రా యూనిట్ తెలిపింది.