విజ‌య్‌ దేవ‌ర‌కొండ సినిమాకి ప్ర‌ముఖ ఓటీటీ బంప‌ర్ ఆఫ‌ర్?

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో విజ‌య్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రానికి ఓ పాపుల‌ర్ ఓటీటీ సంస్థ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. సినిమాని థియేటర్ల‌లో కాకుండా నేరుగా డిజిటల్ రిలీజ్ చేస్తే ఏకంగా 200 కోట్ల రూపాయలు ఇస్తామని సదరు ఓటీటీ సంస్థ ఆఫర్ చేసింద‌ట‌.

డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ హ‌క్కుల‌తో పాటుగా.. ఆల్ లాంగ్వేజ్ శాటిలైట్ రైట్స్ ను స‌ద‌రు ఓటీటీ సంస్థ కోరింద‌ట‌. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిజిటల్ ప్లస్ శాటిలైట్ రైట్స్ తమకు ఇస్తే రెండు వంద‌ల కోట్ల రూపాయలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉంద‌ట స‌ద‌రు ఓటీటీ. మ‌రి ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌కు లైగ‌ర్ మేక‌ర్స్ ఒకే చెబుతారో..లేదో..చూడాలి.