హెబ్బా పటేల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముంబయి బ్యూటీ.. బోల్డ్ హీరోయిన్గా యూత్ను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో హెబాకు వరుస ఆఫర్లు కూడా వచ్చాయి.
కానీ, కథల ఎంపికలో పొరపాట్లు చేయడం వల్ల.. హెబ్బాకు వరుస ఫ్లాపులు పడ్డాయి. దీంతో హీరోయిన్ రేస్లో ఈ భామ వెనుకపడిపోయింది. ఇక ప్రస్తుతం ఓదెల రైల్వే స్టేషన్, తెలిసిన వాళ్లు అనే చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు నటనకు ప్రాధాన్యత ఉండేవే కావడం విశేషం.
మరోవైపు సోషల్ మీడియాలో యమా యాక్టివ్గా ఉండే హెబ్బా.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ కాక రేపుతుంటుంది. ఇక తాజాగా ఎద అందాలన్నీ కనిపించిలా పోస్టు చేసిన ఆ ఫోటోకి.. బయటికి వెళ్లడం తగ్గింది కాబట్టి బట్టలు వేసుకోవడం కూడా తగ్గించేశా అంటూ హెబ్బా బోల్డ్ కామెంట్ పెట్టింది. దాంతో ఆమె పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.