నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య కరోనా మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య జీజీహెచ్లో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితమే కన్నుమూశారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా మెరుగుపడని తన ఆరోగ్యం ఆనందయ్య మందు వేసుకోగానే నిమిషాల్లో మెరుగుపడిందని ఇటీవల కోటయ్య స్వయంగా వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ హల్చల్ చేసింది.
ఆనందయ్య మందు తీసుకున్న అనంతరం ఆక్సిజన్ లెవల్స్ పెరగడంతో కుదుటపడ్డారు. కానీ, ఈ వెంటనే ఆయన ఆరోగ్యం తిరిగి విషమించడంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్కు తరలించారు. అయినప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో.. కోటయ్య మృతి చెందాడు.