లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ : బారులు తీరిన మద్యం ప్రియులు..!

wine shopes

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రాల్లో ఈ వైరస్ బారి నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించారు. ఇక కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో మందుబాబులు అలెర్ట్ అయ్యారు. మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు.

ఇక రాష్ట్రంలో ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటన వేలువడడంతో మద్యం దుకాణాల వద్ద మందుబాబు క్యూ కట్టారు. కరోనాను పట్టించుకోకుండా, సామజీక దూరం పాటించకుండా ఒకరిపైన ఒకరు తోసుకుంటూ క్యూ లైన్ లో నిలబడ్డారు. దాదాపు పదిరోజులకి సరిపడా మందును తీసుకెళ్తున్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా దుకాణాల ఎదుట పోగవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మాస్కు ధరించని వారిని వెనక్కు పంపుతున్నారు. భౌతికదూరం పాటించాలని మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వారికి సూచిస్తున్నారు.