ప్రముఖ హీరోయిన్స్‌కు ఆన్‌లైన్ వేధింపులు..?

సినీ నటి గీతాంజలికి సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. కొందరు పోకిరీలు తన ఫోటోను డేటింగ్ యాప్ లో పెట్టి తనను వేధిస్తున్నారని గీతాంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోకిరీల చర్యల వల్ల తనకు అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని నింధితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. ఆమె ఫిర్యాదు పై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ పని చేసింది ఆమె సన్నిహితులేనా? లేక ఇత పోకిరీలు ఎవరైనా చేశారా అన్నది తేలాల్సి ఉంది.

‘శీలవతి’ వంటి సినిమాల్లో నటించిన గీతాంజలి ఫొటోను డేటింగ్ యాప్ లో పెట్టిన విషయం తెలియడంతో కొందరు సినీ ప్రముఖులు ఫైర్ అవుతున్నారు. ఇటీవల చాలా మంది సెలబ్రిటీల ఫోటోలు ఇలా కొన్ని అసభ్య వెబ్ సైట్లల్లో పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం సింగర్ మధుప్రియ కూడా వేధింపుల విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు గుర్తుతెలియని వారి నుంచి అసభ్యకర రీతిలో కాల్స్ వస్తున్నాయని షీటీమ్ ను ఆశ్రయించింది.