ఇటీవల ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన టాలీవుడ్ యంగ్ సందీప్ కిషన్ ప్రస్తుతం జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో `గల్లీ రౌడీ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ – ఎంవీవీ సినిమా పతాకాలపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా..బాబీ సింహా, నటకిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ వి.వి.వినాయక్, డైరెక్టర్ నందినీ రెడ్డి `గల్లీ రౌడీ` ఫస్ట్ లుక్ను విడుదల చేశారు.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోవడంతో పాటు.. సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సందీప్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. కాగా, ఈ చిత్రం మే 21న గ్రాండ్ రిలీజ్ కానుంది.