సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్ చందర్ నాయక్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ కవితకు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ అక్కినేని సమంత ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. ఓ షోరూం నుంచి ఫోన్కాల్ వచ్చిన కవితకి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయింది. ఆ తరువాత గురువారం సాయంత్రం బంజారాహిల్స్లోని మారుతి షోరూంకు వెళ్లగా, అక్కడి నిర్వాహకులు రూ.12.50 లక్షల విలువ చేసే స్విఫ్ట్ డిజైర్ కారును ఆమెకు అందజేశారు.
ఆరు నెలల క్రితం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఓ ప్రోగ్రాంలో కవితకు ఆహ్వానం వచ్చింది. షో ద్వారా తన జీవిత చరిత్ర తెలుసుకున్న నిర్వాహకులు, యూ ట్యూబ్లో దాన్ని పోస్టు చేశారు. అది చూసిన నటి సమంత తనకు ఇలా బహుమతి పంపారని కవిత ఎంతో ఆనందం పొందింది. డోవూర్ చందర్ నాయక్ తండాకు చెందిన కవితకు బాల్య వివాహం జరిగింది. తన భర్త రోజు తాగొచ్చి ఆమెను కొట్టేవాడు. అతని వేధింపులు ఇక భరించలేక పుట్టింటికి వచ్చేసింది కవిత. ఆ తరువాత తన తల్లి, దండ్రులు చనిపోవడంతో కుటుంబ పోషణ అంతా తనపైనే పడింది.దీంతో ఆటో డ్రైవింగ్ నేర్చుకొని హైదరాబాద్కి వచ్చి, మీయాపూర్ టూ బాచుపల్లి దారిలో ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తోంది.