`ఆంధ్రజ్యోతి` సంస్థల ఎండీ ఆర్కే ఇంట్లో తీవ్ర విషాదం!

‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ(ఆర్కే) ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఆర్కే సతీమణి, ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ కన్నుమూశారు. గ‌త‌ కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క‌న‌క‌దుర్గ కొద్ది సేప‌టి క్రిత‌మే తుది శ్వాస విడిచారు.

ఈమె వ‌య‌సు 63 సంవ‌త్స‌రాలు. వేమూరి కనకదుర్గ మృతి ప‌ట్ల‌ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతానం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, సాయంత్రం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో కనకదుర్గ అంత్యక్రియలు జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలుస్తోంది.