జ‌గ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్‌తో… ఈ వైసీపీ ఎమ్మెల్యేల‌కు పండ‌గే పండ‌గ‌..!

ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల‌కు.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌ను స్వ‌యంగా క‌లు సుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. దీనినే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కోరుకుంటున్నారు. “ఇప్ప‌టికే మూడేళ్లు గ‌డిచిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు .. మా సీఎంతో నేరుగా పోయి మాట్లాడిందే లే!“ అని వైసీపీకి క‌ర‌డు గ‌ట్టిన‌.. అభిమాని.. సీమ జిల్లాల‌కుచెందిన ఎమ్మెల్యే ఒక‌రు నేరుగానే వ్యాఖ్యానించారు. ఇక‌, ఇరు గు పొరుగు పార్టీల నుంచి వ‌చ్చి.. ఎమ్మెల్యేలు అయిన వారి ఆవేద‌న అంతా ఇంతాకాదు. […]