తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతా హడావుడి నెలకొంది. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుండగా.. రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కూడా జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కమల్ కోయంబత్తూర్ దక్షిణం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. కోయంబత్తూరు నియోజకవర్గంలో తరచూ ఆయన పర్యటిస్తున్నారు. మంగళవారం భారీ […]