ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ లీకై 22 మంది రోగులు మృతి..!

ఒక‌వైపు దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. వేలాది మంది ప్రాణాల‌ను బ‌లిగొంటున్న‌ది. అదేవిధంగా తీవ్ర ఆక్సిజ‌న్ కొర‌త నెల‌కొన్న నేప‌థ్యంలోనూ ప‌లువురు మృత్యువాత ప‌డుతున్నారు. ఇప్ప‌టిక ఆక్సిజ‌న్‌ను పొదుపుగా వాడాల‌ని ప్ర‌భుత్వం, అధికారులు వైద్య‌శాల‌లు, సిబ్బందికి సూచిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆ దిశ‌గా వైద్య‌సిబ్బంది దృష్టి సారించిన‌ట్లు క‌న‌బ‌డ‌డం లేదు. మహారాష్ట్ర నాసిక్ లోని ప్రముఖ జాకీర్ హుస్సేన్ వైద్య‌శాల‌లో ఆక్సిజ‌న్ ట్యాంక్ లీకై ఏకంగా 22 మంది రోగులు మృత్యువాత ప‌డ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్న‌ది. చ‌ర్చ‌నీయాంశంగా […]