ఒకవైపు దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నది. అదేవిధంగా తీవ్ర ఆక్సిజన్ కొరత నెలకొన్న నేపథ్యంలోనూ పలువురు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటిక ఆక్సిజన్ను పొదుపుగా వాడాలని ప్రభుత్వం, అధికారులు వైద్యశాలలు, సిబ్బందికి సూచిస్తున్నాయి. అయినప్పటికీ ఆ దిశగా వైద్యసిబ్బంది దృష్టి సారించినట్లు కనబడడం లేదు. మహారాష్ట్ర నాసిక్ లోని ప్రముఖ జాకీర్ హుస్సేన్ వైద్యశాలలో ఆక్సిజన్ ట్యాంక్ లీకై ఏకంగా 22 మంది రోగులు మృత్యువాత పడడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. చర్చనీయాంశంగా […]