2014-15 మధ్య కాలంలో గుంటూరు కేంద్రంగా జరిగిన పత్తి కొనుగోళ్లలో వెలుగు చూసిన కుంభకోణం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. దళారులు, వ్యాపారులతో కుమ్మక్కయిన మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది రైతుల నుంచి పత్తిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఎక్కువ మొత్తానికి కొన్నట్టు రికార్డులు సృష్టించారు. ఈ క్రమంలో దాదాపు 1000 కోట్ల మేరకు కుంభకోణం జరిగినట్టు విజిలెన్స్ విభాగమే నిగ్గు తేల్చింది. దాదాపు లక్షా 93 వేల క్వింటాళ్ల పత్తిని రైతుల నుంచి […]