ఇప్పుడు రాజకీయాల్లో మనుగడ సాగించడమంటేనే కోట్లతో ముడిపడిన వ్యవహారమైపోయింది. అందుకే విలువలతోకూడిన రాజకీయాలు సాగించేవారి సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి, ఎమ్మెల్యే పదవిలో కూర్చోడానికే ఇరవై నుంచి ముప్పై కోట్లు ఖర్చవుతోందని శాసనసభ్యులు అనధికారికంగా మాట్లాడుతున్నపుడు వాపోతూ చెపుతున్న మాట. అందుకే గెలిచిన దగ్గర్నుంచీ డబ్బులు తిరిగి రాబట్టుకునేందుకు…ఆ తర్వాతి ఎన్నికల్లో నిలబడేందకు సొమ్ము సమకూర్చుకునేందుకు… ఆదాయ మార్గాలేమున్నాయా… అని వెతుకుతున్నవారే నేటి రాజకీయాల్లో అధిక శాతం. ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖలో ఇదేరకమైన […]