ప‌వ‌న్ చ‌క్రం తిప్పుతున్నారా.. మారుతున్న ప‌రిణామాల‌పై వైసీపీ డేగ‌క‌న్ను..!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఏపీకి వ‌స్తున్నారు.. ఇది వైసీపీకి ఆనంద‌క‌ర ప‌రిణామం. ఎందుకంటే.. ఆయ‌న నోటి నుంచి ఇక్క‌డి ప్ర‌భుత్వాన్ని పొగిడించుకునేందుకు ఇప్ప‌టికే ఢిల్లీస్థాయిలో వైసీపీ నాయ‌కులు చ‌క్రం తిప్పార‌ని తెలుస్తోంది. అయితే.. అదేస‌మ‌యంలో బీజేపీ.. వైసీపీ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీ టీడీపీకి చేరువ అవుతోంది. ఇది భారీ ఎత్తున వైసీపీని క‌ల‌వ‌ర‌పెడుతున్న అంశం. ఎందుకంటే.. ఏది జ‌ర‌గ‌కూడ‌ద‌ని.. వైసీపీ భావించిందో అదే జ‌రుగుతోందికాబ‌ట్టి!! వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఒంట‌రిగా గెలవాలంటే.. 2019 ఎన్నిక‌ల్లో జ‌రిగిన‌ట్టుగా.. […]