మ‌హేష్‌, ప్ర‌భాస్ కంటే ముందే వ‌స్తున్న‌ భీమ్లా నాయ‌క్?!

సంక్రాంతి 2022కి పెద్ద పెద్ద సినిమాలు విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ రాధేశ్యామ్ జనవరి 14న విడుదల కాబోతుండ‌గా, మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట జనవరి 13న రిలీజ్ కానుంది. అయితే వీరి కంటే ముందే వ‌స్తున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌వ‌న్‌, రానా ద‌గ్గుబాటి కాంబోలో తెర‌కెక్కుతున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `అయ్యప్పనుం కోషియం` రీమేక్. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ […]