బాబు హిట్‌… వైసీపీలో గుబులు ప‌ట్టుకుందా…!

ఒక్కొక్క‌సారి అనుకుని చేసినా.. అనుకోకుండా చేసినా.. నాయ‌కుల వ్యాఖ్య‌లు.. సంచ‌ల‌నంగా మారుతుం టాయి. గ‌త ఎన్నిక‌ల్లో 151 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకున్నాం.. కేవ‌లం 23 మంది మాత్ర‌మే.. చంద్ర బాబుకు మిగిలారు. ఇది దేవుడు ఇచ్చిన తీర్పు.. అని జ‌గ‌న్ అనేక సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. వీరిలోనూ న‌లుగురిని.. వైసీపీవైపు మ‌ళ్లించుకున్నారు. ఇక‌, మిగిలింది.. 19 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే. సో.. దీనిని బ‌ట్టి.. వైసీపీ నేత‌లు.. ఏమ‌నుకున్నారంటే.. “వీరు మ‌న‌ల్ని ఏం చేస్తారు.. లే!“ అని. కానీ, […]

సీఎం జ‌గ‌న్ అస‌హ‌నం.. మంత్రి వ‌ర్గం మార్పు ఖాయం..?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో మ‌ళ్లీ మంత్రి వ‌ర్గ‌కూర్పుపై త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రుగుతోంది. ఇటీవ‌లే.. పీకే టీం స‌భ్యుడు.. మంత్రుల‌కు సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్టును సీఎం జ‌గ‌న్‌కు అందించిన‌ట్టు తెలిసింది. దీనిలో మంత్రులు చాలా వ‌ర‌కు మౌనంగా ఉన్నార‌ని.. వారి వ‌ల్ల ప్ర‌భుత్వానికి మైలేజీ ద‌క్క‌డం లేద‌ని.. చెప్పారు. దీంతో జ‌గ‌న్ కూడా ఆలోచ‌న‌లో ప‌డ్డారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల‌పై ప్ర‌త్యేకంగా ఆయ‌న దృష్టి పెట్టారు. అస‌లు ఎంత మంది మంత్రులు యాక్టివ్‌గా ఉంటున్నారు? ఎంత […]

2024 ఎన్నిక‌ల్లో గెలుపే టార్గెట్‌గా జ‌గ‌న్ తెర‌చాటు వ్యూహం… దిమ్మ‌తిరగాల్సిందే..!

రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. అనేక అనుమానాల‌కు తావిస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. రాజ‌ధాని విష‌యం.. ఇప్పుడు ఆమూలాగ్రం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఒక‌వైపు.. రాజ‌ధాని రైతులు మ‌హాపాద‌యాత్ర 2.0ను ప్రారంభించారు. కేంద్రం రాజ‌ధానిపై చ‌ర్చిద్దాం.. ర‌మ్మ‌ని పిలుపునిచ్చింది. మూడు రాజ‌ధానులు కాదు.. ఒకే రాజ‌ధాని అని.. రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది. ద‌రిమిలా.. మూడు రాజ‌ధానుల‌కే త‌మ మొగ్గు అంటూ.. మంత్రులు, నాయ‌కులు.. ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ ప్ర‌భుత్వం.. ఏం […]

ఏపీ ప్ర‌జ‌ల‌పై బీజేపీ కొత్త గేమ్ స్టార్ట్‌… ఈ సారి న‌మ్మలేమా….!

రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ ఇదే. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ఇస్తున్నామ ని.. ఇటీవ‌ల కాలంలో ప‌దే ప‌దే చెబుతున్న రాష్ట్ర క‌మ‌ల‌నాథులు.. రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌లోనూ పాల్గొంటున్నారు. అంతేకాదు.. రైతుల ప‌క్షాన కూడా మాట్లాడుతున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు.. రాజ‌ధాని విష‌యంలో ఎలా ఉన్నా.. ఇప్పుడు బీజేపీ తీరు మారింద‌ని.. త‌మ‌కు అండ‌గా ఉంటుంద‌ని.. రైతులు భావిస్తున్నారు.అందుకే.. వారు చేస్తున్న ప్ర‌తి కార్య‌క్ర‌మానికీ.. బీజేపీ నేత‌ల‌ను కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే.. ఇప్పుడు బీజేపీ […]

కొడాలి నాని కోసం ప‌ని చేస్తోన్న టీడీపీ కోవ‌ర్టులు ఎవ‌రు…!

రాజ‌కీయాల్లో కోవ‌ర్టులు కామ‌న్‌. అయితే.. ఇది ఎంత వ‌ర‌కు? దీనికి హ‌ద్దు ప‌ద్దు ఉండ‌దా? క‌నీసం.. పార్టీ ఉప్పు తింటున్నాం.. అనే క‌నీస ఆలోచ‌న కూడా ఉండ‌దా? అంటే.. ఉండ‌ద‌నే అంటున్నారు గుడివాడ టీడీపీ నాయ‌కుల గురించి తెలిసిన వారు. ఇది ముమ్మాటికీ నిజం! గుడివాడ ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌. కాదు కాదు.. ఇప్ప‌టికీ కంచుకోటే! కానీ, ఇక్క‌డ పార్టీ మాత్రం.. వ‌రుస ప‌రాజ‌యాల‌తో ముందుకు సాగుతోం ది. దీనికి కార‌ణం ఏంటి? ఒక‌ప్పుడు అన్న‌గారు ఎన్టీఆర్‌ను […]

జ‌గ‌న్ యాక్ష‌న్ దెబ్బ‌కు ఈ వైసీపీ నేత‌ల రియాక్ష‌న్ మారిందే…!

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ యాక్ష‌న్ అన‌గానే.. ఆ పార్టీ నాయ‌కులు.. మంత్రులు రియాక్ష‌న్ ప్రారంభించే శారు. ఇది మంచిదే.. అధినేత చెప్పిమాట‌ను పాటించ‌డం.. అంద‌రికీ మంచి ప‌రిణామ‌మే. కానీ, ఇక్క‌డే ఉంది.. మ‌రో కిటుకు.. ప్ర‌స్తుతం జ‌గ‌న్ చెప్పిన యాక్ష‌న్‌తో నేత‌ల‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. అంతేకాదు.. రూపాయి ఖ‌ర్చు కూడాలేదు. దీంతో వారంతా కూడా.. రెడీ అయిపోతున్నారు.మ‌రి ఈ దూకుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌మంటే మాత్రం.. ఎందుకు ఉండ‌డం లేనేది ప్ర‌శ్న‌. ఇక‌, విష‌యంలోకి […]

సెంటిమెంటుతో జ‌గ‌న్‌ను బుట్ట‌లో ప‌డేసిన వైసీపీ టాప్ లీడ‌ర్‌…!

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యేగా నామినేష‌న్ నుంచి గెలి చిన త‌ర్వాత‌.. ప్ర‌మాణ స్వీకారం వ‌ర‌కు కూడా నాయ‌కులు.. అనేక ముహూర్తాలు.. సెంటిమెంట్లు చూసు కునేవారు. అయితే.. వీటికి భిన్నంగా ఏపీలో మ‌రో సెంటిమెంటు కూడా ఉంది. ఒక‌సారి స్పీక‌ర్ ప‌ద‌విని చేప‌ట్టిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్క‌ర‌నే సెంటిమెంటు ఉంది. ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి ప్ర‌స్తుత విభ‌జ‌నతో ఏర్ప‌డిన న‌వ్యాంధ్ర వ‌ర‌కు కూడా ఇదే […]

ఏపీలో వినాయ‌క చ‌వితి రాజ‌కీయం.. వైసీపీకి ఎఫెక్టేనా..?

అత్యంత సున్నిత‌మైన అంశాల విష‌యంలో ఏ పార్టీ అయినా.. ఏ ప్ర‌భుత్వ‌మైనా ఆచితూచి అడుగులు వేస్తాయి. ఎందుకంటే.. ఆయా ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తింటే.. అది రాజ‌కీయంగా ప్ర‌భావం చూపిస్తుం ద‌నే వాద‌న ఉంటుంది కాబ‌ట్టి. కానీ,రాష్ట్రంలో ఉన్న వైసీపీప్ర‌భుత్వానికి ఎవ‌రు స‌ల‌హాలు ఇస్తున్నారో.. ఎవ‌రు ఏం చెబుతున్నారో.. తెలియ‌దు కానీ.. కీల‌క‌మైన హిందూ సామాజిక వ‌ర్గం విష‌యంలోప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు.. తీసుకుంటున్న నిర్ణ‌యాలు వివాదానికి కార‌ణంగా మారుతున్నాయి. మ‌రో నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వినాయ‌క చ‌వితి […]

వైసీపీలో అస్స‌లు త‌గ్గేదేలే అంటోన్న ఆ ఇద్ద‌రు…!

వైసీపీలో చాలా మంది నాయ‌కులు ఉన్నారు. అయితే.. ఎక్కువ మంది.. ఏదో ఉన్నామంటే.. ఉన్నాం.. గెలి చామంటే గెలిచాం.. అన్న‌ట్టుగానే వున్నారు. త‌ప్పితే.. ఎక్క‌డా దూకుడు ప్ర‌ద‌ర్శించడం లేదు. అంతేకాదు.. ఒక‌రిద్ద‌రు.. మాత్రం.. త‌మ‌కు ప్రాధాన్యం లేన‌ప్పుడు ఎందుకు? అనే ప్ర‌శ్న కూడా గుప్పిస్తున్నారు. ఈ నేప థ్యంలో కొంద‌రు మాత్రం త‌మ‌కు ప‌ద‌వులు ఉన్నా.. లేకున్నా.. మాత్రం ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. వీరే.. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాకు చెందిన‌.. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని […]