టీఆర్‌ఎస్‌లో క‌ల‌క‌లం.. నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్‌లు ఔట్‌

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో క్ష‌ణ క్ష‌ణం టెన్ష‌న్ టెన్ష‌న్‌గా మారింది. ఇప్ప‌టికే రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ త‌ర‌ఫున ఇంచార్జ్‌ల‌ను నియ‌మించే ప‌నికి శ్రీకారం చుట్టారు. ఇది బాగానే ఉన్నా.. ఎంచుకున్న విధానంపైనే ఇప్పుడు కిందిస్థాయి నేత‌ల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. అయితే, పార్టీకి బ‌లంగా ఉన్న వ్య‌క్తుల‌కు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించ‌గ‌ల వ్య‌క్తుల‌కు మాత్ర‌మే ఇంచార్జ్ బాధ్య‌త‌లు […]

టీడీపీ టు వైసీపీ.. యూ ట‌ర్న్ ఎమ్మెల్యేల లిస్ట్ ఇదే

టీడీపీ మొద‌లుపెట్టిన `ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌` దెబ్బ‌కు ప్ర‌తిప‌క్ష వైసీపీ గిల‌గిల్లాడిపోయింది. అభివృద్ధిని చూసి వ‌చ్చార‌ని టీడీపీ చెబితే.. ప్ర‌లోభాలకు లొంగిపోయారని వైసీపీ నేత‌లు వారికి బ‌దులు ఇవ్వ‌డం తెలిసిందే! అయితే ఇప్పుడు టీడీపీ నేత‌లకు దిమ్మ‌తిరిగే షాక్ త‌గ‌ల‌బోతోంద‌ట‌. అభివృద్ధిని చూసి పార్టీలోకి వెళ్లిన నేత‌లు.. ఇప్పుడు అంతే వేగంతో యూ ట‌ర్న్ తీసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నార‌నే టాక్ జోరుగా న‌డుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రుగుతుందో లేదో స్ప‌ష్టత లేక‌పోవ‌డం, మ‌రోప‌క్క వైసీపీ అధినేత ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు […]

డ్రగ్స్ ఉచ్చులో మీడియాధిప‌తి, 15 మంది విలేక‌ర్లు

ప్ర‌స్తుతం డ్ర‌గ్స్ ఇష్యూ టాలీవుడ్‌లో పెను ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మంది ప్ర‌ముఖుల‌కు ఇప్ప‌టికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచార‌ణ ప్రారంభించారు. ఈ విచార‌ణ ప‌రంప‌ర‌లో బుధ‌వారం డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌ను, గురువారం సినిమాటోగ్రాఫ‌ర్ శ్యాం కె.నాయుడును విచారించిన అధికారులు శుక్ర‌వారం సుబ్బ‌రాజును విచారిస్తున్నారు. ఇక తొలి రెండు రోజులు విచార‌ణ త‌ర్వాత సిట్ అధికారుల‌కు దిమ్మ‌తిరిగిపోయే విష‌యాలు తెలిశాయ‌ట‌. పూరీ, శ్యాం కె నాయుడును సిట్ అధికారులు […]

బీజేపీని న‌మ్మ‌ని బాబు… జ‌న‌సేన వైపు చూపు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీపై ఆశ‌లు లేవా ? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీడీపీ దోస్తానా వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఉంటుందా ? మ‌ధ్య‌లోనే క‌ట్ అవుతుందా ? చ‌ంద్ర‌బాబు 2019 ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్త లేకుండానే పోటీకి రెడీ అవుతున్నారా ? అంటే ఇలా ఎన్నో సందేహాలతో కూడిన ప్ర‌శ్న‌లు ఏపీ రాజ‌కీయాల్లో వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్రంలో జ‌రుగుతోన్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తుంటే ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే కేంద్రంలో ఉన్న […]

వైసీపీ నావ వైసీపీ వాళ్లే ముంచేస్తున్నారు…

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ చావో రేవో పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నార్త్‌కు చెందిన ప్ర‌శాంత్ కిషోర్‌ను రంగంలోకి దించారు. పీకే కూడా ఏపీలో త‌న వ‌ర్క్ స్టార్ట్ చేసేశాడు. పీకే బృందాలు ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో సర్వేలు చేస్తున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం అమ‌రావ‌తిలో జ‌రిగిన ప్లీన‌రీలో జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల పేరుతో ఎన్నికల హామీలు కూడా ప్ర‌క‌టించేశాడు. జ‌గ‌న్ 2019 ఆప‌రేష‌న్ పేరుతో గెలుపు కోసం ఇంత […]

డ్రగ్స్ కేసు కూడా ఆ కేసులా మిగిలి పోతుందా?

మాద‌క ద్ర‌వ్యాల కేసుకు సంబంధించి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్‌ను దాదాపు 11 గంట‌ల‌కు పైగా హైద‌రాబాద్ సిట్ అధికారులు విచారించ‌డం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించింది. ప్ర‌స్తుతానికి 12 మంది పేర్ల‌నే సిట్ బృందం బ‌య‌ట‌పెట్టినా.. దీని వెనుక చాలా మంది పెద్ద త‌ల‌కాయ‌లే ఉన్న‌ట్టు తెలుస్తోంది. నిప్ప‌లేందే పొగ‌రాద‌న్న‌ట్టు.. కేవ‌లం 12 మందితోనే భాగ్య‌న‌గ‌రంలో మాద‌క ద్ర‌వ్యాల వ్య‌వ‌హారం సాగుతోంద‌ని చెప్ప‌లేం. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం పాత్ర కీల‌కంగా […]

అక్క‌డ టీడీపీని అంద‌రూ గాలికొదిలేశారా..!

కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు. ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి. ప్ర‌స్తుతం దివంగ‌తులైన‌ప్ప‌టికీ.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్న‌ట్టు.. ఆయ‌న పేరు తెలియ‌నివారు లేదు. ఎన్‌టీఆర్ తో మొద‌లు పెట్టిన రాజ‌కీయ ప్ర‌స్థానం.. త‌ర్వాత చంద్ర‌బాబు హ‌యాంలోనూ అప్ర‌తిహ‌తంగా సాగింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎర్ర‌న్నాయుడు త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకోవ‌డ‌మేకాకుండా.. టీడీపీకి జిల్లాను కంచుకోట‌గా మార్చారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న ఓ రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూశాక‌.. ఆయ‌న కుమారుడు కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడిని కూడా ప్ర‌జ‌లు నెత్తిన పెట్టుకున్నారు. ఇక‌, […]

కాంగ్రెస్ గూడు ఖాళీ.. వైసీపీలోకి మాజీ మంత్రి

ఏపీలో ఎలాగైనా స‌రే మ‌ళ్లీ అస్థిత్వం నిల‌బెట్టుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఇప్ప‌ట్లో సాకార‌మ‌య్యేలా లేవు. విభ‌జ‌న తాలూకు ఆగ్ర‌హం ఇంకా ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తూనే ఉంది. దీంతో కాంగ్రెస్ ఇప్ప‌ట్లో కోలుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో ఈ పార్టీలోని సీనియ‌ర్ నేత‌లు ఒక్క‌క్క‌రుగా జెండాలు మార్చేసి.. త‌మ భ‌విష్య‌త్తును చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి, క‌డ‌ప‌కు చెందిన డీఎల్ ర‌వీంద్రా రెడ్డి కూడా ఫ్యూచ‌ర్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు జెండా మార్చేయాల‌ని డిసైడ్ అయ్యారు. […]

ముద్ర‌గ‌డ దీక్ష‌.. చిన‌రాజ‌ప్ప విందు.. డిఫ‌రెంట్ స్టోరీ!

రాజ‌కీయాల్లో ఒక్కొక్క సారి జ‌రిగే.. సిల్లీ ఘ‌ట‌న‌లు భ‌లే స‌ర‌దాగా ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం విష‌యంలో జ‌రిగింది. కాపులకు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌నే ఏకైక అజెండాతో అధికార ప‌క్షానికి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు ముద్ర‌గ‌డ‌. నిరాహార దీక్ష‌లు, ఆత్మ‌హ‌త్యా హెచ్చ‌రిక‌లు వంటివి ఆయ‌న ప్ర‌ధాన ఆయుధాలు. గ‌తంలోఆయ‌న భార్యా స‌మేతంగా చేసిన హ‌ల్‌చ‌ల్ అంతా ఇంతా కాదు. ఇక‌, దీనికి ప్ర‌భుత్వం నుంచి కౌంట‌ర్ తీవ్రంగానే ఉంటోంది. ముద్ర‌గ‌డ‌కు అనుమ‌తి లేద‌ని, కాపుల‌కు ఆయ‌న […]