బాలీవుడ్ నటుడు అనుప‌మ్ ఖేర్ భార్య కిర‌ణ్ ఖేర్‌కు బ్ల‌డ్ క్యాన్స‌ర్..!‌

బాలీవుడ్ విలక్షణ న‌టుడు అనుప‌మ్ ఖేర్ త‌న భార్య కిర‌ణ్ ఖేర్‌ బ్లడ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు తాజాగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. కిర‌ణ్ ప‌లు చిత్రాల్లో న‌టించ‌డంతో పాటు ఇప్పుడు బీజేపీ ఎంపీగా కూడా ప‌ని చేస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా కిర‌ణ్ బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో ఉన్నారని అనేక వార్తలు వస్తున్నా క్రమంలో దీని పై అనుప‌మ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అందరికి క్లారిటీ ఇచ్చారు. కిర‌ణ్ ప్ర‌స్తుతం మైలోమా అనే బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతుంది. […]

వైరల్ అవుతున్న వైల్డ్ డాగ్ చిత్రం తెర వెనుక క‌థ వీడియో..!

డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ఏంత్తో వైవిధ్యంగా కధలను ఎంచుకుంటూ, ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న నాగార్జున తాజాగా వైల్డ్ డాగ్ అనే చిత్రం చేసిన చేసిన సంగతి అందరికి తెలిసిందే. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ పతాకం పై నిరంజన్‌రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. ఏప్రిల్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ జరుగుతున్నాయి. ఎన్‌ఐఎ బృందం సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులను ఏర వేసే క్రమంలో వైల్డ్ డాగ్ మూవీ తెర‌కెక్క‌గా, […]

ర‌జ‌నీకాంత్‌ అవార్డు పై సీఎం కేసీఆర్ హ‌ర్షం..!

త‌మిళనాట సూప‌ర్‌స్టార్‌ ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావ‌డం ప‌ట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్‌కు కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌టుడిగా ద‌శాబ్దాల పాటు ఆయనకంటూ ఒక ప్ర‌త్యేక శైలి చూపెడుతూ,నేటికి దేశ విదేశాల్లో ఎంతో మంది అభిమానుల‌ ఆద‌ర‌ణ పొందుతున్న ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్ర‌క‌టించ‌డం గొప్ప విష‌య‌మ‌ని కేసీఆర్ చెప్పుకొచ్చారు. హిందీ ఇండస్ట్రీ నుండి 32 మంది దాదా సాహెబ్ […]

జ‌మ్మూలో టీటీడీ ఆల‌యానికి భూమిని కేటాయించిన ప్ర‌భుత్వం..!

జ‌మ్మూ క‌శ్మీర్‌లో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం దేవాలయాన్ని నిర్మించనున్నారు. జ‌మ్మూలో నిర్మించ‌నున్న ఆ ఆల‌యం కోసం అక్కడ ప్ర‌భుత్వం ఆలయం కోసం భూమిని కేటాయించింది. 40 ఏళ్ల పాటు ఆ భూమిని లీజుకు ఇవ్వ‌నున్నారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా నేతృత్వంలో జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకునట్లు తెలిపారు. జ‌మ్మూలో వేద పాఠ‌శాల‌, ఆధ్మాత్మిక‌ ధ్యాన కేంద్రం, రెసిడెన్షియ‌ల్ క్వార్ట‌ర్స్‌, వైద్య‌ విద్యా కేంద్రాల‌ను కూడా వారు నిర్మించ‌నున్నారు. కేంద్ర పాలిత ప్రాంత‌మైన కా‌శ్మీర్‌లో ఆల‌య […]

ప్రిన్స్ మహేశ్ బాబు‌ నిర్మాతగా మరో ప్రాజెక్ట్..?

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నిర్మాత గా మరో ‌ ప్రాజెక్ట్‌ రానుంది. ఇప్పటికే ఆయన అడవి శేషు‌ హీరోగా మేజర్ సినిమాని నిర్మి​స్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హీరో నవిన్‌ పోలిశెట్టి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. పూర్తి ఎంటర్టై‌న్‌మెంట్‌తో ప్లాన్‌ చేస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే చర్చలు జరుగినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇకపోతే, పూర్తి తారాగాణాన్ని నిర్ణయించాక దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని సినీ […]

క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జ‌గ‌న్!

కంటికి క‌నిపించ‌కుండా ప్ర‌జ‌ల‌ను నానా తంటాలు పెడుతున్న క‌రోనా వైర‌స్‌.. మ‌ళ్లీ విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కేసులు వెయ్యికి పైగా న‌మోదు అవుతున్నాయి. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ క్యార్య‌క్ర‌మం కూడా జోరుగానే జ‌రుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ఈ రోజు గుంటూరులో భారతపేట 140వ వార్డు సచివాలయంలో క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. సతీమణి భారతితో కలిసిన వెళ్లిన ఆయనకు అక్కడి వైద్యులు వ్యాక్సిన్ వేశారు. అనంతరం సీఎం సతీమణి వైఎస్ […]

ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేసిన బాల‌య్య‌..ఎందుకోస‌మంటే?

వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా సెల్వమణికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఫోన్ చేశారు. ఎందుకూ.. ఏమిటీ.. అన్న వివ‌రాలు తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఇటీవ‌ల రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినీ ప్ర‌ముఖులు ఆమెను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే బాలకృష్ణ కూడా రోజా కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. […]

సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పి ల‌హ‌రికి క‌రోనా పాజిటివ్‌..!

బాలీవుడ్‌లో క‌రోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతుండ‌డంతో చాలా మంది సెలబ్రిటీస్ క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పి ల‌హ‌రి కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న‌తో కాంటాక్ట్ ఉన్న వాళ్లంద‌రు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని బ‌ప్పి ల‌హ‌రి మేనేజ‌ర్ తెలిపారు. ఆయ‌న క్షేమం కోరుకునే వారంద‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తున్నాం అని స్పోక్స్ ప‌ర్స‌న్ అన్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ నటుడు […]

పాత బ్రిడ్జి కూలి ఒక వ్యక్తి మృతి..!

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. జిల్లాలోని వాంకిడిలో పాత వంతెన కూలిపోవడంతో ఒక వ్యక్తి అక్కడిక్కడే చనిపోయాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వాంకిడిలో ఉన్న పాత బ్రిడ్జిని అక్కడ కార్మికులు నిన్న సగం కూల్చి వేశారు. కాగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ కేబుల్‌ పనుల కోసం ఇద్దరు సిబ్బంది వంతెన పై పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ ఉన్న ఇద్దరు కార్మికులు శిథిలాల్లో చిక్కుకు పోయారు. […]