ముంబైలో వెలుగు చూసిన పోర్న్ గ్రఫీ కేసులో హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పేరు బాగా వినిపించింది. ఎంతోమంది హీరోయిన్ల సైతం ఆయన పైన విమర్శలు చేయడం కూడా జరిగింది. ఈ కేసులో అరెస్టు అయ్యి కూడా జైలుకు వెళ్లి బెయిల్ పైన తిరిగి రావడం జరిగింది. తాజాగా ఈ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ కావడం , సుప్రీంకోర్టులో నాలుగు వారాలా బెయిల్ ను మంజూరు చేయడం జరిగింది. అశ్లీల వీడియోల కేసులో తనని బలి పశువు చేశారని రాజ్ కుంద్రా తెలియజేశారు. అయితే ఈ కేసులో ఒక్క మహిళ కూడా తనకు వ్యతిరేకంగా చెప్పలేదని కోర్టుకు విన్నపించుకున్నారు.ఇక అందుకు సంబంధించి ఏ ఒక్క ఆధారాన్ని కూడా సాక్షాలతో నిరూపించలేదని తెలియజేశారు.. దీంతో తనపై వచ్చిన ఈ కేసును కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించడం జరిగింది. తన న్యాయవాది ప్రశాంత్ పాటిల్ ద్వారా రాజ్ కుంద్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. చార్జి సీటులో ఏ ఒక్క మహిళ కూడా తను బెదిరించినట్లుగా, బలవంతం పెట్టినట్లు, వీడియోలు తీసినట్లు ఎవరు చెప్పలేదని పిటిషన్ లో తెలియజేయలేదని తెలియజేశారు. రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన తర్వాత తన చీకటి వ్యాపారాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి నగ్న వీడియోలు తయారు చేయడం వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వంటి అభియోగాలు వెలుపడ్డాయి.
డిజిటల్ ఎంటర్టైన్మెంట్ అనే మొబైల్ యాప్ రాజ్ కుంద్రాతో కలిసి బక్షి సంయుక్తంగా నిర్వహిస్తున్నారని ముంబైలో జాయింట్ పోలీస్ కమిషనర్ అప్పట్లో తెలియజేశారు. ఇక ఈ యాప్ ను 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకునేలా వారు రూపొందించినట్లుగా సమాచారం. ఇక ఇందులో కొంతమంది హాటెస్ట్ మోడల్స్ వీడియోలు అప్లోడ్ చేసినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఈ యాప్ నుంచి ఉచితంగా అశ్లీల వీడియోలు డౌన్లోడ్ చేసుకొనే విధంగా రూపొందించారు. ఇలాంటి విషయంలో తనని బలి పశువు చేశారని వాపోతున్నారు రాజ్ కుంద్రా.