గోపీచంద్ సినిమాలో ఆ మలయాళ నటుడు ఎంట్రీ.. తెలుగోళ్లు సరిపోవడం లేదా అంటున్న ఫ్యాన్స్…!

యంగ్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గోపీచంద్ తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. వచ్చే షెడ్యూల్ నుంచి ఈ సినిమా షూటింగ్లో మలయాళ నటుడు జయరాజ్ కూడా పాల్గొనున్నట్లు సమాచారం.

జయరాజ్ – గోపీచంద్ పై ఓకీలక సీక్వెల్ ను షూట్ చేయబోతున్నారని.. అందుకోసం ఓ భారీ సెట్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా జయరాజ్ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం ఆట. ఈ సినిమాలో దర్శకుడు శ్రీను వైట్ల ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తున్నాడని టాక్.

ఇక కామెడీ క్రియేషన్ లో శ్రీను వైట్లకి ఎంతటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాపై గోపీచంద్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” మన తెలుగు నటీనటులు సరిపోవడం లేదా మీ సినిమాకి. మలయాల్ వాళ్లు కూడా కావాలా.. మీ సినిమాకి తెలుగు వాళ్లే ఎక్కువ ” అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.