సాధారణంగా ప్రతి ఒక్కరూ బొప్పాయని తింటూ ఉంటారు. కానీ ఎవ్వరు వాటి ఆకులను జ్యూస్ గా చేసుకుని తాగరు. వాటిలో ఉండే ఔషధాల గురించి మనకు తెలియనందున వాటిని వేస్ట్ గా పడేస్తూ ఉంటాము. కానీ అందులో ఉండే విటమిన్ లను మీరు తెలుసుకుంటే తప్పకుండా వాటిని జ్యూస్ చేసుకుని తాగుతారు.
ఇక బొప్పాయి ఆకుల జ్యూస్ ఎందుకు ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి ఆకుల జ్యూస్ తాగడం వల్ల నిరోధక శక్తి పెరుగుతుంది అని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. అలాగే ఈ రసం తాగడం వల్ల అనేక విటమిన్లు మన బాడీకి అందుతాయి. తద్వారా మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచారు. ఇక డెంగు జ్వరాన్ని బొప్పాయి ఆకుల రసంతో నయం చేసుకోవచ్చు.
ఇందులో ఉండే ఔషధాలు మన బాడీలో ఉన్న చెడు బ్యాక్టీరియాను బయటకి తరిమేస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి ఈ బొప్పాయి జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకుల రసం అనేక సమస్యలకి బెస్ట్ మెడిసిన్ అనే చెప్పాలి. అలాగే కాలేయ సమస్యతో బాధపడే వారికి ఇది బెస్ట్ చిట్కా. ఈ ఆకుల రసాన్ని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అందువల్ల కనీసం వారానికి రెండు లేదా మూడుసార్లు అయినా ఈ బొప్పాయి ఆకుల రసం తాగడం చాలా మంచిది.