తెలుగు రాష్ట్రాల్లో కాలా పాషా (షేక్ అహ్మద్) కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కుర్చి తాతగా పాపులారిటీ దక్కించుకున్న ఈ ముసలాయన.. ఒకే ఒక డైలాగ్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు. ఇప్పుడు వరుస సినిమా ఆఫర్లను అందుకుంటు తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాట్లు తెలుస్తుంది. ఇప్పటికే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన కాలపాషా తన డైలాగ్తో మొదలయ్యే పాటలో తానే డబ్బింగ్ చెప్పుకున్నాడట.
ప్రసాద్ రికార్డింగ్ స్టూడియోలో.. థమన్ పర్యవేక్షణలో కుర్చీ మడత అంటూ వచ్చే సాంగ్ లిరిక్స్ తానే పాడాడని తెలుస్తుంది. ఈ సాంగ్కు మహేష్, శ్రీ లీల మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. మరి ఈ తాత ఈ సాంగ్ దెబ్బతో మరోసారి పాపులర్ అయ్యాడు. అయితే ఈ సాంగ్ పై మీ రియాక్షన్ ఏంటని ఓ యూట్యూబర్ అడగగా కుర్చి తాత స్పందిస్తు మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాలో నా డైలాగ్తో పాట రావడం.. దానికి నేనే డబ్బింగ్ చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ వివరించాడు.
ఇదే నేపథ్యంలో మరొక గుడ్ న్యూస్ను తెలియజేశాడు కాలాపాషా. తను త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న గురూజీ నెక్స్ట్ మూవీ లో కూడా ఓ పాత్రలో నటించబోతున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అదృష్టం జిడ్డులా పట్టుకోవడం అంటే ఇదేనేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.