తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు లాంటివారు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు. వీరిద్దరూ కూడా తెలుగు ప్రేక్షకుల మనసులో ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉంటారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్. ఇక వీరి నటనకు ఎంతోమంది వీరాభిమానులు సైతం ఉన్నారు. ఇక వీరు కుటుంబాన్ని వీరితో ఆపేయకుండా ఇంకా సాగిస్తున్నారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ నందమూరి బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ కొనసాగుతుండగా… ఏఎన్ఆర్ వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కొనసాగుతున్నారు.
ఇక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కి కూడా మొదటి సినిమాతోనే మంచి విజయం రాలేదు. అనంతరం పలు సినిమాలు చేసుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డం నీ సంపాదించుకున్న తర్వాత ఇద్దరు ప్రముఖులు కేవలం 6 నెలల వ్యవధిలోనే హైదరాబాదులో తమ స్టూడియో లను స్థాపించారు.
ఏఎన్ఆర్ అన్నపూర్య స్టూడియోస్ స్థాపించగా.. ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ ప్రారంభించారు. స్వర్ణయుగం ప్రారంభమైన తొలి దశాబ్దంలో విడుదలైన సినిమాలలో సగం సినిమాలు వీరివే. దాదాపు వీరిద్దరూ కలిసి 14 సినిమాలలో నటించారు. ఇక వీరిద్దరి సిని జర్నీ చూస్తే ఒకేలా ఉంటుంది. అంతేకాకుండా వీరిద్దరి నటన సైతం ఓకే విధంగా ఉంటుంది.