ఎన్టీఆర్ చేసిన ఆ పని వల్లే బాలయ్య, నాగార్జున మధ్యన దూరం ఏర్పడిందా..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత మూడు తరాలుగా నందమూరి, అక్కినేని కుటుంబాల నుంచి హీరోలు వెండితెరకు పరిచయం అవుతూనే ఉన్నారు. ఇక మొదట్లో నటదిగ్గజాలుగా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్ మంచి స్నేహంగా ఉండే వారిని.. వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేదని అందరికీ తెలుసు. అయితే ఆ తరువాత తరం హీరోలుగా నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే వీరిద్దరి మధ్యన అంతగా సఖ్యత ఉండదని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్ద‌రు కనీసం మాట్లాడుకోరని అంటారు.

బాలకృష్ణ కూడా కొన్ని సమయాల్లో అక్కినేని ఫ్యామిలీ పై టంగ్ స్లిపై అక్కినేని, తోక్కినేని అంటూ ఇన్సల్టింగ్ గా మాట్లాడాడ‌ట‌. అదేవిధంగా నాగార్జున ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో బాలయ్య సినిమాను ఉద్దేశించి చేయి అడ్డుపెట్టి ట్రైన్లు ఆపడం లాంటి సీన్స్ లో నటించడం మ‌న వ‌ల్ల కాదు అంటూ అప్పట్లో రిలీజ్ అయినా బాలయ్య బ్లాక్ బస్టర్ హీట్ సినిమా గురించి ఇన్సల్టింగ్ గా మాట్లాడాడని ఇలా వీరిద్దరి మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయని టాక్‌. ఇప్పటికీ కూడా నాగార్జునకి సంబంధించిన ఫంక్షన్ లో బాలకృష్ణ, బాలకృష్ణ కి సంబంధించిన ఈవెంట్స్ లో నాగార్జున హాజరుకారు.

వీరిద్దరూ బ‌ద్ద‌ శత్రువులుగా ఉంటార‌ని తెలుస్తుంది. అయితే గతంలో నాగార్జున విషయంలో సీనియర్ ఎన్టీఆర్ ఒక మిస్టేక్ చేశారట‌. ఆ కారణంగానే బాలకృష్ణ, నాగార్జునకు మధ్యన దూరం పెరిగిందని తెలుస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. నాగార్జున, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సంకీర్తన మూవీ గీతాకృష్ణ డైరెక్షన్లో రూపొందింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. అప్పట్లో నేషనల్ అవార్డు వరకు కూడా వెళ్లాల్సిందట. కానీ అప్పటి ముఖ్యమంత్రిగా సీనియర్ ఎన్టీఆర్ ప్రభుత్వ ఉంది. ఈ సినిమాని నేషనల్ అవార్డుకి పంపడానికి ప్రభుత్వం అస్సలు ఆసక్తి చూపలేదు.

దీంతో ఈ సినిమాకు రావాల్సిన నేషనల్ అవార్డ్ దక్కకుండా పోయిందని.. అప్పట్లో వార్త‌లు విచ్చాయి. అయితే అంత మంచి సినిమాని నేషనల్ అవార్డుకి పంపకపోవడంతో సీనియర్ ఎన్టీఆర్ గవర్నమెంట్ పై చాలా విమర్శలు వచ్చాయట. ఎన్టీఆర్ వాల్లే నాగార్జున నేషనల్ అవార్డ్‌ కోల్పోయారని, ఎన్టీఆర్ కావాలని నాగార్జున సినిమాను జ్యూరీకి పంపకుండా ఆపేసారని.. గతంలో నాగేశ్వరరావు.. అక్కినేని స్టూడియోస్ కట్టే టైంలో ఎన్టీఆర్ కి, నాగేశ్వర్ కి మధ్య జరిగిన గొడవలే దీనికి కారణం అని. ఈ కారణంగానే నాగార్జున సినిమాని నేషనల్ అవార్డుకి పంపకుండా ఎన్టీఆర్ ఆపేసారని.. అప్పటి నుంచే నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్యన వార్ మొదలైందని అంటారు.