తాజాగా మంత్రి రోజాపై టీడీపీ లీడర్ బండారు సత్యనారాయణ మూర్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో నటి రమ్యకృష్ణ స్పందిస్తూ తన స్నేహితురాలిపై చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ” మంత్రి రోజాని బండారు సత్యనారాయణ అసభ్యకరంగా మాట్లాడటం దారుణం. మన దేశంలో మాత్రమే భరతమాతకు జై అని గర్వంగా చెబుతాం.
ఇలాంటి దేశంలో ఓ మహిళపై ఎంత నీచంగా మాట్లాడతారా? అతన్ని క్షమించకూడదు ” అని ఫైర్ అయింది. దీంతో రోజాకు సపోర్ట్ చేస్తున్న రమ్యకృష్ణను టీడీపీ నాయకులు టార్గెట్ చేశారు. ఆమెకు సంబంధించిన పాత వీడియోలు వైరల్ చేస్తున్నారు. ” చెన్నైలో లిక్కర్ అమ్మకాలు లేకపోవడంతో.. రమ్యకృష్ణ మహాబలిపురం నుంచి లిక్కర్ కొనుగోలు చేసి తెచ్చుకుంటుంది ” అనీ వీడియోలు ట్రెండ్ లోకి తెస్తూ.. ఈ విధంగా ఆమె పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు.
రమ్యకృష్ణ పైకి అమాయకురాలుగా కనిపించిన మంచి తెలివైనది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె సినిమాల్లో చేసుకోకుండా రాజకీయాలతో ఆమెకి ఏం పని? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెపై వచ్చిన లిక్కర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రమ్యకృష్ణ గారు ఇలాంటి వారు అని ఎప్పుడూ అనుకోలేదు 😭😭 pic.twitter.com/0wxZOuvANZ
— TDP Germany (@TDP_Germany) October 8, 2023