టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నవీన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో టాలెంట్ ఉన్నా.. దానికి తగ్గట్టుగా కష్టపడే తత్వం ఉన్న.. టాలీవుడ్ లో అవకాశాలను దక్కించుకోలేకపోయాడు. దీంతో ఇంట గెలవకపోయినా రచ్చ గెలిచే ప్రయత్నం చేశాడు. యాడ్స్లో నటించాడు. స్టేజి షోలు, స్టాండ్ అప్ కమెడియన్ గా కూడా తన టాలెంట్ చూపించాడు. ఈ నేపథ్యంలో లక్కీగా బాలీవుడ్ మేకన్స్ దృష్టిలో పడిన నవీన్ మూవీ కొట్టారియాన్ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసాడు.
ఈ సినిమాతో హిట్ కొట్టిన నవీన్ అదే ఫ్లోలో టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చి వరుస హిట్ సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక నవీన్ పోలీస్ శెట్టి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సినిమాలన్నీ హిట్ కావడానికి ప్రధాన కారణం కామెడీ టైమింగ్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఇదే క్రమంలో నవీన్ పోలిశెట్టి ఓ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్నాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. నవీన్ పాలిశెట్టి ఇటీవల రీసెంట్గా మిస్సెట్ మిస్టర్ పోలీశెట్టి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. నేపథ్యంలో కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో తెరకెక్కుతున్న జిగర్ తండా డబుల్ ఎక్స్ మూవీకి ఫస్ట్ ఛాయిస్గా నవీన్ అనుకున్నారట.
ఈ మూవీలో ఎస్. జె. సూర్య నటించిన రోల్ కోసం మొదట ఎస్.జే.సూర్య ఒప్పుకోకపోవడంతో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు నవీన్ను అప్రోచ్ అయ్యాడట. స్టోరీ విన్న నవీన్ ఈ క్యారెక్టర్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా ఆసక్తి చూపించాడు. అయితే మనసు మార్చుకున్న ఎస్.జె.సూర్య తిరిగి క్యారెక్టర్ నటించటానికి ఒప్పుకోవడంతో చేసేదేం లేక డైరెక్టర్ సూర్యనే ఈ క్యారెక్టర్ కు తీసుకున్నారు. షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాపం నవీన్ బ్యాడ్ లక్.. ఓ క్రేజీ ప్రాజెక్టు మిస్ చేసుకొని తమిళ్ ఎంట్రీ ఆఫర్ ని చేజార్చుకున్నాడు అంటూ.. అన్ అక్కి ఫెలో అంటూ కామెంట్ చేస్తున్నారు నెట్టిజన్లు.